స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం తన 28వ చిత్రంలో నటిస్తున్నారు. పూజా హెగ్డే, శ్రీలీల నాయికలు. ఈ సినిమాను ఫ్యామిలీ ఎంటర్టైనర్గా దర్శకుడు త్రివిక్రమ్ రూపొందిస్తున్నారు. హారికా హాసినీ క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉందీ సినిమా. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు విడుదల చేయాలని నిర్ణయించారు.
ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఒకటి ప్రచారంలోకి వచ్చింది. పలు దఫాలుగా చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా షూటింగ్కు ప్రస్తుతం చిన్న విరామం ఇచ్చారట. ఇది సమ్మర్ బ్రేక్ అనుకోవచ్చు. మళ్లీ మేలో షూటింగ్ తిరిగి ప్రారంభిస్తారని తెలుస్తున్నది. మే 31న స్వర్గీయ సూపర్స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఈ చిత్ర టైటిల్ను ప్రకటిస్తారని సమాచారం. తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.