యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో రాజమౌళి తెరకెక్కించిన పీరియాడికల్ చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ ఆడియెన్స్ లో కూడా ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. పీరియాడికల్ మూవీగా దాదాపు 450 కోట్ల రూపాయల బడ్జెట్తో సినిమాని తెరకెక్కించారు. జనవరి 7న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా నిన్న ట్రైలర్ విడుదల చేశారు.
ఆర్ఆర్ఆర్ చిత్ర ట్రైలర్ సినీ ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలను సైతం ఎంతగానో ఆకట్టుకుంది. చిరంజీవి, సమంత, అనీల్ రావిపూడి, కోన వెంకట్, అనీల్ రావిపూడి వంటి ప్రముఖులు తమదైన శైలిలో స్పందించారు. ఇక ఈ రోజు ఉదయం సూపర్ స్టార్ మహేష్ బాబు తన ట్విట్టర్ ద్వారా ఆర్ఆర్ఆర్ ట్రైలర్పై ప్రశంసలు కురిపించారు. ట్రైలర్ లో ప్రతి ఒక్క షాట్ కూడా స్టన్నింగ్ గా ఉంది. మైండ్ బ్లోయింగ్ అండ్ స్పెక్టాక్యూలర్ గా ఈ ట్రైలర్ ఉంది. మాస్టర్ స్టోరీ టెల్లర్ రాజమౌళి గూస్ బంప్స్ వచ్చేలా ట్రైలర్ మన ముందుకు తెచ్చాడు అంటూ చిత్ర బృందానికి విషెస్ తెలియజేశాడు.
ఆర్ఆర్ఆర్ హీరోస్ ఎన్టీఆర్, రామ్ చరణ్లతో మహేష్ బాబుకి మంచి స్నేహా బంధం ఉంది.గతంలో వీరు ముగ్గురు పలు పార్టీలలో సందడి చేయగా, ఆ ఫొటోలు నెటిజన్స్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. రీసెంట్గా మహేష్ .. ఎన్టీఆర్ హోస్ట్ చేసిన ఎవరు మీలో కోటీశ్వరులు షోలో సందడి చేసిన విషయం తెలిసిందే. ఇక చరణ్తో కలిసి ఓ మల్టీ స్టారర్ చేయబోతున్నాడని ఇటీవల ప్రచారం నడుస్తుంది.