మహేష్బాబు, త్రివిక్రమ్ కలయికలో రూపొందనున్న నూతన చిత్రం పూజా కార్యక్రమాలు గురువారం హైదరాబాద్లో జరిగాయి. శ్రీమతి మమత సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్ర కథానాయిక పూజాహెగ్డేపై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి మహేష్బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ క్లాప్ నివ్వగా, ప్రముఖ పారిశ్రామిక వేత్త సురేష్ చుక్కపల్లి కెమెరా స్విచ్చాన్ చేశారు. మై హోం గ్రూప్ డైరెక్టర్ జూపల్లి రామ్ దర్శకుడికి స్క్రిప్ట్ అందజేశారు. మహేష్-త్రివిక్రమ్ కలయికలో గతంలో రూపొందిన అతడు, ఖలేజాలకు మించే విధంగా ఈ తాజా చిత్రం వుంటుందని, తప్పకుండా ఈ చిత్రం ఈ ఇద్దరి కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్గా నిలుస్తుందని చిత్రబృందం ఆశాభావం వ్యక్తం చేసింది. ఏప్రిల్లో రెగ్యులర్ షూటింగ్ను ప్రారంభిస్తామని, ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తామని నిర్మాత తెలిపారు.