సినీ ప్రియుల్లో ఆసక్తి కలిగిస్తున్న మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్ సినిమా గురించి మరో కొత్త విషయం బయటకొచ్చింది. మార్చిలో ఈ సినిమాకు ముహూర్తం పెట్టుకోనున్నారని తాజా సమాచారం. శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ నిర్మించనున్నారు. ఈ సినిమా ఆఫ్రికా అడవుల నేపథ్యంగా సాగే అడ్వెంచర్ థ్రిల్లర్గా తెరకెక్కనుంది. విజయేంద్రప్రసాద్ కథను అందిస్తున్నారు. బాలీవుడ్ భామ దీపికా పడుకోన్ను నాయికగా ఎంపికచేశారట. మార్చిలో ముహూర్తం పెట్టుకుని ప్రీ ప్రొడక్షన్కు కావాల్సినంత టైమ్ తీసుకుని సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో దర్శకుడు రాజమౌళి ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ ప్రాజెక్ట్ను ప్రాంఛైజీలుగా తెరకెక్కించే ప్రయత్నమూ చేస్తున్నట్లు గతంలో కథా రచయిత విజయేంద్రప్రసాద్ చెప్పారు. ఎలా చూసినా తెలుగు తెరపై ఇది మరో ప్రతిష్టాత్మక సినిమా కానుంది. ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో తన కొత్త చిత్రంలో నటిస్తున్నారు.