న్యూఢిల్లీ : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడిగా ఓం రౌత్ నిర్ధేశకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఆదిపురుష్ టీజర్ ఇటీవల విడుదలై నెటిజన్ల నుంచి భారీ స్పందన రాబట్టింది. మరోవైపు ఆదిపురుష్ టీజర్లో గ్రాఫిక్స్పై సెటైర్లు పేలుతుండగా తాజాగా ఈ టీజర్పై మహాభారత్లో శ్రీకృష్ణుడుగా నటించిన నితీష్ భరధ్వాజ్ స్పందించారు.
ఆదిపురుష్ మూవీ టీజర్ను తాను చూశానని..రామాయణం, మహాభారత్ వంటి గొప్ప కావ్యాలను తెరపై ఆవిష్కరించడంలో ఫిల్మ్ మేకర్లకు విఎఫ్ఎక్స్ ఆధునిక టెక్నాలజీగా ముందుకు రావడం సంతోషకరమని అన్నారు. ఈ టీజర్ చాలా బాగుందని మూవీ చూసేందుకు తాను వేచిచూస్తున్నానని చెప్పారు.
ఆదిపురుష్ మూవీ దర్శకుడు ఓం రౌత్, టీ సిరీస్ సంస్ధలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మూవీలో ప్రభాస్తో పాటు క్రితి సనన్, సైఫ్ అలీ ఖాన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. భూషణ్ కుమార్, కృషన్ కుమార్, రాజేష్ మోహనన్, ఓం రౌత్ నిర్మాతలుగా రూపొందుతున్న ఆదిపురుష్ వచ్చే ఏడాది జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.