టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్కి ఇటీవల మంచి హిట్స్ పడడం లేదు. ఏ సినిమా చేసిన నెగెటివ్ టాక్ తెచ్చుకుంటుంది. కొద్ది రోజులుగా అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న మహా సముద్రం చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాలో మరో హీరో సిద్ధార్థ్ కూడా లీడ్ రోల్ పోషిస్తుండగా.. అదితీ రావు, అను ఇమాన్యూయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
కొద్ది రోజుల క్రితం చిత్ర షూటింగ్ పూర్తి కాగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో సీనియర్ హీరో జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల హే రంభా అనే ఫస్ట్ లింగ్ లిరికల్ వీడియోను విడుదల చేసింది చిత్రయూనిట్. ఇది శ్రోతలను ఎంతగానో అలరించింది.
మహా సముద్రం చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, మేకర్స్ రిలీజ్ డేట్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని వచ్చే అక్టోబర్ 14న దసరా కానుకగా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్టుగా తెలియజేసారు. దసరా బరిలో నిలవనున్న ఈ చిత్రం ఇతర చిత్రాలకు పోటీగా తట్టుకొని మంచి విజయం సాధిస్తుందా అన్నది చూడాలి.చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించాడు. అలాగే ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మాణం వహించారు