నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రలలో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన చిత్రం లవ్ స్టోరీ. విడుదలైన అన్ని థియేటర్స్లో ఈ చిత్రం మంచి వసూళ్లతో దూసుకుపోతుంది. ఏఎంబీ థియేటర్ లో కోటి రూపాయల గ్రాస్ వసూళ్లను దక్కించుకొని సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. విడుదలైనప్పటి నుండి ఇప్పటి వరకు మొత్తం 251 షో లు లవ్ స్టోరీ ని ఏఎంబీలో ప్రదర్శించారు. ఇప్పటి వరకు మొత్తంగా 48233 మంది లవ్ స్టోరీ సినిమాను చూశారు.
సెకండ్ వేవ్ తర్వాత అతి పెద్ద విజయంగా నిలిచిన లవ్ స్టోరీ చిత్రం ఆహా స్ట్రీమింగ్ కు కూడా సిద్దం అయింది. థియేటర్ రన్ ఆల్ మోస్ట్ ముగియనుండడంతో ఈ సినిమా అక్టోబర్ 22 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ సినిమా శాటిలైట్ రైట్స్ను ప్రముఖ తెలుగు జనరల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ స్టార్ మా సొంతం చేసుకుంది.
మంచి కాన్సెప్ట్ మెసేజ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన లవ్ స్టోరీ చిత్రం ఆకట్టుకునే కథ మరియు కథనాలతో సాగింది.
సాయి పల్లవి మరియు నాగ చైతన్యల కాంబోకు మంచి మార్కులు పడ్డాయి. ఆకట్టుకున్న స్టార్ కాస్టింగ్ కు తోడు పాటలు కూడా చక్కగా కుదిరాయి. మొత్తంగా శేఖర్ కమ్ముల ఒక మంచి సినిమాను కాస్త ఆలస్యం అయినా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి సక్సెస్ ను దక్కించుకున్నాడు.