అందమైన ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కి ప్రేక్షకులని అలరించిన చిత్రం లవ్ స్టోరీ. అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రలలో క్లాసికల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అనేక అవాంతరాలను ఎదుర్కొంటూ సెప్టెంబర్ 24న విడుదలైన లవ్ స్టోరీ సినిమా సూపర్ హిట్ అవడమే కాకుండా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబట్టింది.
గ్రామీణ ప్రాంతాలలో ఉన్న కులవివక్షత.. అమ్మాయిల పట్ల ప్రస్తుతం జరుగుతున్న సంఘటన నేపథ్యంలో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదలై మంచి విజయం సాధించిన చిత్రంగా లవ్ స్టోరీ నిలిచింది. ఈ చిత్రం ఇప్పటికీ పలు సెంటర్స్లో హౌస్ ఫుల్ కలెక్షన్స్తో దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీ డిజిటల్ ప్లాట్ ఫాంలోకి రానుంది.
ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా ఈ మూవీ డిజిటల్ రైట్స్ దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఆహాలో అక్టోబర్ 22 నుంచి లవ్ స్టోరీ సినిమమా స్ట్రీమింగ్ కానున్నట్లుగా సమాచారం. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.అతి త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన చేయనున్నట్టు తెలుస్తుంది.