కన్నడంలో విజయం సాధించిన ‘లవ్ మాక్టేయిల్-2’ చిత్రం తెలుగులో రానుంది. స్వీయ దర్శకత్వంలో డార్లింగ్ కృష్ణ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని ఎం.వి.ఆర్.కృష్ణ నిర్మించారు. మిలీన నాగరాజ్ కథానాయిక. ఈ సినిమాలోని ‘ఎవరితో పయనం’ అనే పాటను బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత ఎం.వి.ఆర్.కృష్ణ మాట్లాడుతూ ‘కన్నడంలో బ్లాక్బస్టర్ హిట్గా నిలిచిన ఈ చిత్రాన్ని ఈ వేసవిలో తెలుగులో రిలీజ్ చేయబోతున్నాం. హృద్యమైన ప్రేమకథగా ఆకట్టుకుంటుంది. పాటలు బాగా కుదిరాయి’ అన్నారు. అమృత అయ్యంగర్, రచల్ డేవిడ్, నకుల్ అభయాన్కర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: శ్రీక్రేజీ మైండ్స్, సంగీతం: నకుల్ అభయాన్కర్, కథ-దర్శకత్వం: డార్లింగ్ కృష్ణ.