షణ్ముఖ పురాణంపై టాలీవుడ్ దర్శకుల కన్ను పడింది. ఇప్పటికే కుమారస్వామి కథతో త్రివిక్రమ్ ఓ సినిమా చేయనున్నట్టు నిర్మాత సూర్యదేవర నాగవంశీ మీడియా సాక్షిగా వెల్లడించారు. మరో దర్శకుడు కిశోర్ తిరుమల కూడా షణ్ముఖ పురాణంలోని కీలక ఘట్టం ఆధారంగా సినిమా చేయనున్నట్టు వార్తలొచ్చాయి. ఈ క్రమంలోనే మరో దర్శకుడు ప్రశాంత్వర్మ కూడా కుమారస్వామి కథపై మక్కువ చూపిస్తున్నారు. ఇటీవలే షణ్ముఖ పురాణంలోని ఓ కథను ప్రశాంత్వర్మకు నటుడు సముద్రఖని వినిపించారట.
కథ నచ్చడంతో దాన్ని తన ప్రశాంత్వర్మ సినిమాటిక్ యూనివర్స్(PVCU) ద్వారా సెల్యులాయిడ్పైకి తెచ్చేందుకు ప్రశాంత్వర్మ సన్నాహాలు చేస్తున్నారని వినికిడి. సముద్రఖని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారట. ప్రస్తుతం ప్రశాంత్వర్మ ‘జై హనుమాన్’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ప్రశాంత్వర్మ సినిమాటిక్ యూనివర్స్లోనే ‘మహాకాళి’ సినిమా కూడా రూపొందుతున్నది. మొత్తంగా పురాణ కథలు, పాత్రలతో సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉన్నారు ప్రశాంత్వర్మ.