‘మా నగరం’ సినిమాతో ఇండస్ట్రీలోకి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన లోకేష్.. మొదటి సినిమాతోనే విభిన్న దర్శకుడిగా కోలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన ‘ఖైదీ’, ‘మాస్టర్’ వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లవడంతో దక్షిణాదిన లోకేష్ పేరు మారు మోగిపోయింది. ఇక ఇటీవలే ‘విక్రమ్’తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒక ఫ్యాన్ తన అభిమాన హీరోని డైరెక్ట్ చేస్తే అవుట్పుట్ ఎలా ఉంటుందో ‘విక్రమ్’తో లోకేష్ నిరూపించాడు. కమల్ హాసన్ను రూ.400 కోట్ల క్లబ్లో నిలబెడ్డాడు. ఒక్క తమిళంలోనే కాకుండా విడుదలైన ప్రతి భాషలో ఈ చిత్రం రెండింతలు కలెక్షన్లను సాధించింది. ప్రస్తుతం లోకేష్ నెక్స్ట్ చిత్రంపై ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే లోకేష్ దర్శకుడు కాకపోయింటే మీమ్ క్రియేటర్ అయ్యేవాడట. మీమ్స్ తరచుగా చూస్తానని, తనకు మీమ్స్ చేయాడం ఇష్టమని, ఒక వేళ డైరెక్టర్ కాకపోయుంటే ఖచ్చితంగా మీమర్ అయ్యేవాడినిని ఓ ఇంటర్వూలో తెలిపాడు. ప్రస్తుతం లోకేష్, విజయ్తో తన తదుపరి సినిమాను చేయనున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను ప్రారంభించిన ఈ చిత్రం త్వరలోనే సెట్స్పైకి వెళ్ళనుంది. విజయ్ ప్రస్తుతం ‘వారసుడు’ సినిమాతో బిజీగా ఉన్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్రాజు నిర్మిస్తున్నాడు. ఇటీవలే చిత్రం నుండి విడుదలైన ఫస్ట్లుక్ పోస్టర్కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది.