కెప్టెన్సీ టాస్క్లో భాగంగా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ని సక్సెస్ ఫుల్గా పూర్తి చేసేందుకు హాజ్మేట్స్ చాలా కష్టపడ్డారు.ఆకలిని తట్టుకొని నిలిచారు. రవి-విశ్వలకు పవర్ రూం యాక్సెస్ లభించడంతో వాళ్లకి పోటీగా ప్రియ-ప్రియాంకల జోడీని ఎంచుకున్నారు. ఇచ్చిన కట్టెలను ముక్కలుగా చేయాలని చెప్పడంతో విశ్వ కట్టెల్ని పిండి చేశాడు. ఈ టాస్క్లో విశ్వ టీం గెలిచింది.
నటరాజ్ మాస్టర్ టీంలో ఉన్న లోబో ఆకలికి తట్టుకోలేక.. చెత్త కవర్లో దాచి పెట్టిన ఆహారాన్ని తీసుకోవడానికి ట్రై చేశాడు. ఎవరికి కనపడకుండా చెత్త కవర్ లో ఆహారం తినేందుకు ప్రయత్నించాడు. ఆ సీన్ చూసి నటరాజ్ మాస్టర్ ఆకలి వేస్తే నువ్వు తినేయ్, నేను గేమ్ వదిలేస్తున్నా అని చెప్పాడు. మరోవైపు సన్నీ-మానస్లకు పవర్ రూం యాక్సెస్ లభించడంతో.. నటరాజ్ మాస్టర్-లోబోలను పోటీదారులుగా ఎంచుకున్నారు.
వీరి కోసం మనుగుతారా తేలుతారా టాస్క్ ఇవ్వగా తెలివిగా ఆడిన ఈ గేమ్లో సన్నీ-మానస్ విన్నర్స్గా నిలిచారు. అయితే ఇంటి సభ్యుల ఆకలి సహనాన్ని పరీక్షించడానికి బిగ్ బాస్ ఇంట్లో ఉన్న వాళ్లందరికీ మటన్ బిర్యానీ పంపారు. అయితే సిరి-షణ్ముఖ్, మానస్-సన్నీ, శ్రీరామ్-హమీదా ఈ మూడు జంటలు తప్ప మిగిలిన వాళ్లంతా బిర్యానీ లాగించేశారు. నటరాజ్ మాస్టర్ తినకుండా ఒంటరి పోరాటం చేశాడు.