టాలీవుడ్ నుంచి రాబోతున్న మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ లైగర్ (Liger). విజయ్దేవరకొండ (Vijay Deverakonda) టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. టాలీవుడ్ టాలెంటెడ్ మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం ఆగస్టు 25న గ్రాండ్ గా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాలపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి.
తెలుగు, హిందీ వెర్షన్ ట్రైలర్ రికార్డు స్థాయిలో వ్యూస్ రాబడుతోంది. ఇక విడుదలకు ముందే ఏదో ఒక న్యూస్తో ట్రెండింగ్ టాపిక్గా నిలుస్తోంది లైగర్. కాగా ఇప్పుడు నైజాం థ్రియాట్రికల్ రైట్స్ కు సంబంధించిన అంశం టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచింది. తాజా గాసిప్ ప్రకారం నైజాం ఏరియాలో నైజాం థ్రియాట్రికల్ రైట్స్ సుమారు రూ.30 కోట్ల వరకు పలుకుతుందట. విజయ్ దేవరకొండ కెరీర్లో ఇది టాప్ మోస్ట్ ఫిగర్ అనే చెప్పాలంటున్నారు ట్రేడ్ పండితులు.
ఈ లెక్కన లైగర్ బాక్సాపీస్ వద్ద రికార్డుల వేట మొదలు పెట్టడం ఖాయమనే సంకేతాలు ఇస్తోంది లైగర్. ఈ క్రేజీ అప్ డేట్ సినిమా మార్కెట్ను మరింత పెంచుతోంది. ఈ సినిమాతో బాలీవుడ్ సీనియర్ యాక్టర్ చుంకీపాండే కూతురు, హీరోయిన్ అనన్యపాండే (Ananya Pandey) టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. లైగర్ చిత్రంలో టాలెంటెడ్ సీనియర్ నటి రమ్యకృష్ణ కీ రోల్ చేస్తోంది.
బాక్సింగ్ బ్యాక్ డ్రాప్లో వస్తున్న ఈ చిత్రాన్ని బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్, పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై అపూర్వ మెహతా, కరణ్ జోహార్, ఛార్మీ కౌర్, పూరీ జగన్నాథ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రపంచ బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ లైగర్లో కీ రోల్ చేస్తున్నాడు. లైగర్ వరల్డ్ వైడ్గా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.