‘నేను బ్రతికి ఉన్నంతకాలం మానసిక క్షోభకు గురవుతూనే ఉంటాను. ప్రమాదం నుంచి నన్ను దేవుడు రక్షించాడని సంతోషపడాలో లేదా నా ప్రాణ స్నేహితురాలిని కోల్పోయానని దుఃఖించాలో అర్థంకావడం లేదు’ అంటూ తమిళ నటి యాషిక ఆనంద్ ఇన్స్టాగ్రామ్లో ఆవేదన వ్యక్తం చేసింది. గత నెలలో ఆమె ప్రయాణిస్తున్న కారు చెన్నై సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ యాక్సిడెంట్లో ఆమె స్నేహితురాలు పావని మృతి చెందారు. తీవ్ర గాయాల పాలైన యాషిక ఆనంద్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవలే ఆమెకు మేజర్ సర్జరీని చేశారు. తాను మరో నాలుగు నెలల పాటు మంచానికే పరిమితమవ్వాల్సి ఉంటుందని యాషిక ఆనంద్ తెలిపింది. ‘నేను చేసిన తప్పుకు నా స్నేహితురాలు ఎప్పటికి నన్ను క్షమించదు. వారి కుటుంబానికి కన్నీళ్లు మిగిల్చినందుకు అనుక్షణం నేను కుమిలిపోతున్నా. ఐసీయూలో ఉన్నప్పటికీ ప్రతిక్షణం నాకు నా స్నేహితురాలే గుర్తుకొచ్చింది. ఆమె జ్ఞాపకాలు జీవితాంతం వెంటాడుతాయి’ అంటూ యాషిక ఆనంద్ చేసిన పోస్ట్ వైరల్గా మారింది.