రంజిత్, సౌమ్యమీనన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘లెహరాయి’. రామకృష్ణ పరమహంస దర్శకుడు. ఎస్.ఎల్.మూవీస్ పతాకంపై మద్దిరెడ్డి శ్రీనివాస్ నిర్మించారు. త్వరలో విడుదలకానుంది. గురువారం టీజర్ను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఫీల్గుడ్ లవ్స్టోరీగా తెరకెక్కించాం. యువతకు బాగా నచ్చుతుంది. ప్రేయ ప్రయాణంలోని అనుభూతులకు అద్దం పడుతుంది. నేటి యువతీ యువకులకు, విద్యార్థులకు ఈ సినిమా ద్వారా మంచి సందేశాన్నిచ్చాం’ అన్నారు. మంచి కంటెంట్తో సినిమా తీశామని, త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని దర్శకుడు నిర్మాత పేర్కొన్నారు. పాటలన్నీ శ్రోతలకు చేరువయ్యాయని సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ తెలిపారు.