గతేడాది సీటీమార్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు యాక్షన్ హీరో గోపీచంద్ (Gopichand). సంపత్ నంది డైరెక్షన్లో కబడ్డీ క్రీడ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. కాగా ఈ హీరో ప్రస్తుతం శ్రీవాసు (Sriwass) డైరెక్షన్లో గోపీచంద్ 30 (Gopichand 30) ప్రాజెక్టు చేస్తున్నాడు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ నేడు హైదరాబాద్లో షురూ అయింది. ఖిలాడీ ఫేం డింపుల్ హయతి (Dimple Hayathi) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
దీంతోపాటు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన క్రేజీ అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే అలనాటి అందాల తార, సీనియర్ నటి ఖుష్బూ సుందర్ (Khushbu Sundar) తాజా చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. ఈ విషయాన్ని మేకర్స్ స్పెషల్స్టిల్తో షేర్ చేసుకున్నారు. ఖుష్బూ సుందర్ ఇప్పటికే వన్ ఆఫ్ ది కీ రోల్ చేస్తున్న ఆడవాళ్లు మీకు జోహార్లు రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు జగపతిబాబు కీరోల్ పోషిస్తున్నాడు.
Team #Gopichand30 is elated to Welcome the Veteran and Ever-Versatile actress @khushsundar garu ONBOARD 🤗
⭐️ing @YoursGopichand
A Film by @DirectorSriwass 🎬
In @peoplemediafcy Production@IamJagguBhai @vishwaprasadtg @vivekkuchibotla pic.twitter.com/KcuCvgSAMy— People Media Factory (@peoplemediafcy) March 3, 2022
సిల్వర్ స్క్రీన్పై జగ్గూభాయ్, గోపీచంద్, ఖుష్బూ సుందర్ కాంబినేషన్ ఎలా ఉండబోతుందన్నది ప్రస్తుతానికి టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. యాక్షన్ ఎంటర్ టైనర్గా రాబోతున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ డైరెక్టర్. మరోవైపు మారుతి డైరెక్షన్లో పక్కా కమర్షియల్ సినిమా చేస్తున్నాడు.