Ilaiyaraaja | ఇండియాలోని గొప్ప సంగీత విధ్వాంసులలో ఇళయరాజా ఒకరు. ఆయన పాటలతో పరవశించిన మ్యూజిక్ ప్రియులు ఎందరో. కాగా హైదరాబాద్ సంగీత ప్రియులకు ఓ శుభవార్త. ఇళయరాజా 80వ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్లో ఓ భారీ సంగీత విభావరికి రంగం సిద్ధమైంది. మ్యూజిక్ మాస్ట్రో ఫిబ్రవరి 25, 26వ తేదీల్లో గచ్చిబౌళి స్టేడియంలో లైవ్ కన్సర్ట్ ఇవ్వనున్నారు. దాదాపు వంద మంది సంగీత విధ్వాంసులతో ఈ వేదికపై కచేరి ఉండనుంది. ఈ ఈవెంట్ను వీక్షించాడినికి దాదాపు ఇరవై వేల మందికి పైగా హాజరు కానున్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్ టాకీస్ ఈ ఈవెంట్ను నిర్వహించనుంది.
దీనిపై ఇళయరాజా చాలా కాలం తర్వాత తిరిగి స్టేజిపైకి రానుండటం, కచేరితో అభిమానులతో కనెక్ట్ కానుండడం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపాడు. మరుపురాని ప్రదర్శనలు, జ్ఞాపకాలను ఆ రోజు మీ అందరితో పంచుకోవడానికి వేచి చూస్తున్నట్లు వెల్లడించాడు. ఇక హైదరాబాద్ టాకీస్ గతంలో 2017లో ఏ.ఆర్ రెహమాన్, 2019లో అరిజిత్ సింగ్లో హైదరాబాద్లో లైవ్ కన్సర్ట్లను ఘనంగా జరిపింది. ఇక ఈ సారి మాస్ట్రో ఇళయరాజాతో కన్సర్ట్ను జరిపించనుంది. ఇళయరాజా కాన్సెర్ట్ను వీక్షించడానికి ఇన్సైడర్ (https://insider.in/)లో టిక్కెట్స్ను బుక్ చేసుకోండి.