శరవణన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లీడర్’. ఆర్.ఎస్.దురై సెంథిల్ కుమార్ దర్శకుడు. పాయల్ రాజ్పుత్ కథానాయిక. ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకురానుంది. బుధవారం గ్లింప్స్ను విడుదల చేశారు.
అనుకోని పరిస్థితుల్లో అండర్ వరల్డ్ మాఫియా మధ్య చిక్కుకున్న ఓ సాధారణ వ్యక్తి కథ ఇదని, దాని నుంచి అతను ఎలా బయటపడ్డాడన్నదే కథాంశమని, యాక్షన్ థ్రిల్లర్గా మెప్పిస్తుందని మేకర్స్ తెలిపారు. శ్యామ్, ఆండ్రియా, సంతోష్ ప్రతాప్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎస్.వెంకటేష్, సంగీతం: జిబ్రాన్ వైభోద, కథ, దర్శకత్వం: ఆర్.ఎస్.దురై సెంథిల్ కుమార్.