లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘సతీ లీలావతి’ చిత్రం సోమవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. తాతినేని సత్య దర్శకుడు. నాగమోహన్బాబు ఎమ్, రాజేష్ టి నిర్మాతలు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత హరీష్ పెద్ది క్లాప్నివ్వగా, వరుణ్తేజ్ కెమెరా స్విఛాన్ చేశారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘ఆద్యంతం ఆహ్లాదభరితంగా సాగే రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కించబోతున్నాం. చక్కటి కథతో కుటుంబ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది’ అన్నారు. సోమవారం నుంచే రెగ్యులర్ షూటింగ్ను ప్రారంభిస్తున్నామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: బినేంద్ర మీనన్, సంగీతం: మిక్కీ జే మేయర్, నిర్మాణ సంస్థలు: దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్, సమర్పణ: ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, దర్శకత్వం: తాతినేని సత్య.