Lavanya Tripathi | మెగా హీరో వరుణ్ తేజ్ సతీమణి, హీరోయిన్ లావణ్య త్రిపాఠి సోమవారం (డిసెంబర్ 15) తన పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మెగా, అల్లు కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు లావణ్యకు బర్త్డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ తన సతీమణికి సోషల్ మీడియా వేదికగా స్పెషల్ విషెస్ తెలిపారు. లావణ్యతో వివిధ సందర్భాల్లో దిగిన అందమైన ఫొటోలను షేర్ చేస్తూ, “హ్యాపీ బర్త్డే బేబీ” అంటూ తన ప్రేమను వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ క్యూట్ ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. వీటిని చూసిన రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల కూడా లావణ్యకు బర్త్డే విషెస్ తెలిపింది. సమంత కూడా ప్రత్యేక విషెస్ తెలిపింది.
అలాగే మెగా అభిమానులు సైతం మెగా కోడలికి శుభాకాంక్షలతో కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ ఫొటోల్లో వరుణ్, లావణ్యల ముద్దుల కుమారుడు కనిపిస్తాడేమోనని అభిమానులు ఆసక్తిగా గమనించారు. కానీ తమ కుమారుడి ముఖం కనిపించకుండా ఇద్దరూ జాగ్రత్త పడ్డారు. పిల్లల ప్రైవసీకి ప్రాధాన్యం ఇస్తూ తీసుకున్న ఈ నిర్ణయానికి నెటిజన్ల నుంచి ప్రశంసలు కూడా వస్తున్నాయి. ఇక వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ‘మిస్టర్’, ‘అంతరిక్షం’ చిత్రాల్లో హీరో, హీరోయిన్లుగా కలిసి నటించారు. అదే సమయంలో ప్రేమలో పడ్డ ఈ జంట సుమారు ఏడేళ్ల పాటు రిలేషన్షిప్లో ఉండి, 2023లో వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్లో వీరికి కుమారుడు జన్మించాడు. అనంతరం కొణిదెల ఫ్యామిలీకి ఇష్టదైవమైన హనుమంతుడి పేరు వచ్చేలా తమ కుమారుడికి ‘వాయువ్ తేజ్ కొణిదెల’ అని పేరు పెట్టారు.
సినిమాల విషయానికి వస్తే… వరుణ్ తేజ్ ప్రస్తుతం ‘కొరియన్ కనకరాజ్’ అనే హారర్ కామెడీ మూవీలో నటిస్తున్నారు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఫేమ్ మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు లావణ్య త్రిపాఠి అధర్వ మురళితో కలిసి నటించిన ‘టన్నెల్’ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 12న థియేటర్లలో విడుదలై మంచి స్పందన అందుకుంది. ఇటీవల ఓటీటీలోకి వచ్చిన ఈ చిత్రానికి కూడా పాజిటివ్ రివ్యూలు వచ్చాయి.