Raj Tarun – Lavanya | టాలీవుడ్ యువ నటుడు రాజ్ తరుణ్, అతడి మాజీ ప్రేయసి లావణ్యల వివాదం మరోసారి తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. లావణ్య ఉంటున్న రాజ్ తరుణ్ ఇంటిని ఆమె వదిలి వెళ్లాలని రాజ్ తరుణ్ తల్లిదండ్రులు బుధవారం వాగ్వాదానికి దిగారు. అయితే ఈ విషయంలో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు తనమీద 15 మందితో కలిసి ఒకేసారి దాడికి దిగారని లావణ్య ఆరోపించింది. తాజాగా ఇదే విషయంపై కంప్లయింట్ ఇవ్వడానికి హైదరాబాద్లోని నార్సింగి పోలీసులను ఆశ్రయించింది.
కోకాపేటలోని తన ఇంటి వద్ద జరిగిన గొడవపై లావణ్య, నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు కాసేపటి క్రితం చేరుకుంది. రాజ్ తరుణ్ తల్లిదండ్రులు 15 మందితో కలిసి తనపై దాడి చేశారని లావణ్య సంచలన ఆరోపణలు చేసింది. ఆ ఇల్లు రాజ్ తరుణ్ తాతముత్తాతల సొంతం కాదని స్పష్టం చేసిన ఆమె, దుర్మార్గంగా 15 మందితో దాడి చేసి ఇంటిని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారని ఆరోపించింది. ఈ దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన లావణ్య, నార్సింగి పోలీస్ స్టేషన్లో ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఈ ఘటనపై లావణ్య బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. రాజ్ తరుణ్ నేను కలిసి ఈ ఇల్లు కొన్నామని.. ఇల్లు కొన్నప్పుడు తాను రూ.70 లక్షలు రాజ్ తరుణ్కి ఇచ్చినట్లు లావణ్య మీడియా ముందు తన ఆవేదన వ్యక్తం చేసింది. 11 ఏండ్లు రాజ్ తరుణ్ నాతో లివ్ ఇన్ రిలేషన్(పెళ్లి కాకుండా కలిసి ఉండడం)లో ఉన్నాడు. అతడు తనతో ఉంటాడని నా జీవితం మొత్తం అతడికే సమర్పించాను. నా వద్ద ఉన్న డబ్బులు కూడా అతడికే ఇచ్చాను. ఇప్పడు అతడి పేరెంట్స్ వచ్చి ఇల్లు తమదని అంటున్నారు. ఇంటికి సంబంధించి తనకు ఎంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది. ఇల్లును మేం కొన్నప్పుడు రూ. 1.5 కోట్లు మాత్రమే ఉంది. ఇప్పుడు ఏకంగా రూ.12 కోట్లకు పెరిగింది. నేను అసలు రాజ్ తరుణ్ పేరెంట్స్ని టచ్ కూడా చేయాలేదు. వాళ్లే ఇంట్లోకి వచ్చి వస్తువులను ధ్వంసం చేశారు. నన్ను ఈడ్చుకుంటూ వెళ్లి ఇబ్బంది పెట్టారంటూ లావణ్య చెప్పుకోచ్చింది.