విశాల్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘లాఠీ’. ఏ. వినోద్కుమార్ దర్శకుడు. రానా ప్రొడక్షన్స్ పతాకంపై రమణ, నంద నిర్మిస్తున్నారు. ఈ నెల 22న విడుదలకానుంది. మంగళవారం థియేట్రికల్ ట్రైలర్ను విడుదల చేశారు. ఇందులో నిజాయితీ కలిగిన పోలీస్ ఆఫీసర్గా విశాల్ కనిపించారు.
వ్యవస్థలోని అన్యాయాల్ని ప్రశ్నించే డాషింగ్ పోలీసాఫీసర్గా ఆయన పాత్ర పవర్ఫుల్గా సాగింది. ‘కర్తవ్య నిర్వహణలో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్కు ఎదురైన సవాళ్లేమిటన్నదే చిత్ర కథాంశం. యాక్షన్తో పాటు ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా ఉంటుంది’ అని దర్శకుడు తెలిపారు.
సునైనా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: బాలసుబ్రమణియన్, సంగీతం: యువన్శంకర్ రాజా, రచన: పొన్ పార్ధిబన్, దర్శకత్వం: ఏ.వినోద్ కుమార్.