NTR30 Pooja Ceremony | మెగా అభిమానులు సైతం ‘ఆచార్య’ సినిమాను ఒక పీడకలగా వర్ణిస్తుంటారు. చిరు, చరణ్లను ఒకే ఫ్రేమ్లో చూడాలన్న మెగా అభిమానుల కోరిక ఆచార్యతో ఫుల్ఫిల్ అవుతుందని అందరూ తెగ సంబురపడిపోయారు. కానీ మొదటి ఆటకే ఆచార్య డిజాస్టర్ టాక్ తెచ్చుకొని ఫ్యాన్స్ను తీవ్రంగా నిరాశపరిచింది. కథ, కథనంలో కొత్తదనం లేకపోవడం, కొరటాల మార్క్ మిస్ అవడం, మణిశర్మ బాణీలు సహనాన్ని ప్రదర్శించడం.. ఒక్కటేమిటి ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమా వైఫల్యం వెనుక ఎన్నో కారణాలు. అసలు కొరటాలనేనా ఈ సినిమా తీసింది అనే డౌట్ కూడా రావడం సహజమే. ఇక కమర్షియల్గానూ ఈ సినిమా నిర్మాతలకు తీవ్ర నష్టాల్ని మిగిల్చింది.
ఈ సినిమా ఫలితం చిరును కూడా తీవ్రంగా నిరాశపరిచింది. ఈ సినిమా ఫలితం వెనుక పూర్తి బాధ్యత కొరటాలదే అని చిరు ఎన్నో సార్లు పరోక్షంగా అన్నాడు. అయితే కొరటాల మాత్రం ఆచార్య సంగతి పక్కన పెట్టేసి ఎన్టీఆర్తో చేయబోయే సినిమాపై పూర్తి ఫోకస్ పెట్టాడు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ ఇటీవలే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంది. కాగా ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి రెండో వారంలో గ్రాండ్గా ప్రారంభం కానుంది. కాగా ఈ ప్రారంభవేడుకకు ఆర్ఆర్ఆర్ యూనిట్ మొత్తం రానున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా చిరుకు కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందిందట. చిరు కూడా మేకర్స్తో సానుకూలంగానే స్పందించాడట. మరీ అంతపెద్ద డిజాస్టర్ ఇచ్చిన కొరటాల సినిమా కోసం చిరు వెళ్తాడా లేదా అనేది చూడాలి.