ముంబై : కరోనా బారినపడ్డ లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ కోలుకుంటున్నారని కుటుంబ సభ్యులు బుధవారం తెలిపారు. ప్రస్తుతం ఆమె ఇంకా ఐసీయూలోనే ఉన్నారని పేర్కొన్నారు. వెంటిలేటర్ లేకుండా ఆమె ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసేందుకు ఇవాళ ఉదయం కొద్దిసేపు వైద్యులు వెంటిలేటర్ తొలగించారని, దీంతో లతాజీ కోలుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయని చెపారు. ఆరోగ్య పరిస్థితిని అనుక్షణం వైద్యులు గమనిస్తున్నారని వివరించారు.
ఈ నెల 8న లతా మంగేష్కర్కు కరోనా పాజిటివ్గా రావడంతో దక్షిణ ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి ఆమెను వైద్యులు ఐసీయూలోనే ఉంచి, చికిత్స అందిస్తున్నారు. డాక్టర్ ప్రతీత్ సమ్దానీ నేతృత్వంలోని వైద్యుల బృందం లతా మంగేష్కర్కు చికిత్స అందిస్తుందని కుటుంబ సభ్యులకు చెప్పారు. ఇదిలా ఉండగా.. లెజెండరీ సింగర్ కరోనా నుంచి కోలుకోవాలని సాధువులు అయోధ్యలో మహామృత్యుంజయ జపం, హవనం నిర్వహించారు.