చేనేత కళాకారుల జీవితాల్ని ఆవిష్కరిస్తూ రూపొందించిన చిత్రం ‘తమసోమా జ్యోతిర్గమయా’. విజయ్ కుమార్ బడుగు దర్శకుడు. ఈ చిత్రం ద్వారా ఆనంద్రాజ్, శ్రావణిశెట్టి హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. చిత్రీకరణ పూర్తయింది. బుధవారం హైదరాబాద్లో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ నెల 29న ప్రేక్షకులముందుకురానుంది. నిర్మాత తడక రమేష్ మాట్లాడుతూ ‘చేతివృత్తులపై ఆధారపడి జీవించేవారి కథ ఇది. మారుతున్న కాలాన్ని బట్టి చేతివృత్తుల వారు మారితే చక్కటి ఉపాధి దొరుకుతుందనే సందేశాన్ని అందిస్తున్నాం. ఈ సినిమా ట్రైలర్ను మంత్రి కేటీఆర్గారు విడుదల చేసి మా చిత్ర బృందాన్ని అభినందించారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం’ అన్నారు. ‘పోచంపల్లి పరిసర గ్రామాల్లో చిత్రీకరణ జరిపాం. 2001- 2014 మధ్యకాలంలో సిరిసిల్ల, భూదాన్ పోచంపల్లిలోని నేత కార్మికుల జీవన పరిస్థితిని ఈ చిత్రంలో ఆవిష్కరించాం. నటీనటులందరూ చక్కటి అభినయాన్ని కనబరిచారు. అందరూ ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నా’ అని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: శ్రవణ్ జీ కుమార్, ఆర్ట్: సైని భరత్, సంగీతం: మార్క్ కె ప్రశాంత్, నిర్మాత: తడక సురేష్, దర్శకత్వం: విజయ్కుమార్ బడుగు.