యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.ఆయన నటించిన రాధేశ్యామ్ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం సలార్, ఆదిపురుష్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు.ఈ రెండు చిత్రాల షూటింగ్ పూర్తయ్యాక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రాజెక్ట్ చిత్రంలో నటించనున్నారు.
రామాయణ ఇతిహాసం ఆధారంగా ఆదిపురుష్ చిత్రం రూపొందుతుండగా, ఇందులో ప్రభాస్ సరసన కృతి సనన్ కథానాయికగా నటిస్తున్నారు.ఓం రౌత్ దర్వకత్వం వహిస్తున్నారు . టీ సిరీస్ బ్యానర్పై ఎంతో ప్రతిష్టాత్మకంగా భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్ రాముడిగా రాముడిగా నటిస్తుండగా, సీతగా కృతి సనన్ నటించబోతోంది.
లక్ష్మణుడిగా సన్నీ సింగ్, ప్రభాస్తో తలపడబోయే రావణుడి పాత్రలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కనిపించబోతున్నారు. మరో ముఖ్యమైన పాత్రలో సీనియర్ నటి కాజోల్ నటిస్తున్నారు. తాజాగా కృతి సనన్ తన పాత్రకు సంబంధించిన విషయాలు వెల్లడించింది. సీత పాత్రలో నటిస్తున్నందుకు ఆనందంగా ఉందని తెలియజేస్తూ,ప్రొఫెషనల్ దుస్తుల్లో ఉన్నప్పుడు మా జంట బాగుంటుంది.తొలి షెడ్యూల్లో ప్రభాస్తో నటించాను.
ఇప్పుడు ఆయనతో మరో షెడ్యూల్ చేయబోతున్నాను.ప్రభాస్ చాలా మంచి వ్యక్తి. అందరితో సరదాగా ఉంటారు. వినయం ఎక్కువ. భోజన ప్రియుడు కూడా. అయితే ఆయనకు బిడియం ఎక్కువ అంటారు. కానీ, అది నిజం కాదు.. ఒకసారి పరిచయం అయితే అతను ఎంతో బాగా మాట్లాడుతాడు. అతనితో స్నేహం నాకు ఎంతో నచ్చింది’ అంటూ కృతి పేర్కొంది.