యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ చిత్రం విడుదలకి సిద్ధం కాగా, సలార్, ఆదిపురుష్ సెట్స్పై ఉన్నాయి. త్వరలో ప్రాజెక్ట్, స్పిరిట్ చిత్రాల షూటింగ్ మొదలు పెట్టనున్నాడు. అయితే ఆదిపురుష్ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, రామాయణం ఆధారంగా ఈ చిత్రం అత్యంత్య ప్రతిష్టాత్మకంగా రూపొందుతుంది.
‘ఆదిపురుష్’లో ప్రభాస్ రాముడిగా, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా నటిస్తున్నారు. ఈ సినిమాలో లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ కనిపించనున్నారు. కృతి రీసెంట్గా చిత్ర షూటింగ్ పూర్తి చేయగా, పలు ఇంటర్వ్యూలు ఇస్తుంది. తాజాగా ప్రభాస్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ప్రభాస్ కి కొంచెం సిగ్గు ఎక్కువ. కొత్తవాళ్లతో మాట్లాడేందుకు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాడు.ఒకసారి కనెక్ట్ అయితే మాత్రం వారితో క్లోజ్గా ఉంటాడు. జోకులు వేస్తాడు. ప్రభాస్ వద్ద ఎప్పుడూ పాజిటివ్ వైబ్స్ ఉంటాయి . సెట్స్ లో అందరూ తెలిసిన వాళ్లే కాబట్టి ప్రభాస్ జోకులతో చెలరేగుతుంటాడు అని కృతి సనన్ తెలిపింది. ఇక ప్రభాస్ వీలుచిక్కినప్పుడల్లా తన కో స్టార్స్ కి డిన్నర్ పార్టీ ఇస్తుంటాడు. హైదరాబాద్ బిర్యానీ, ఆంధ్ర రుచులని వారికి పరిచయం చేస్తుంటాడు అని కృతి పేర్కొంది.