Krithi Shetty | ‘ఉప్పెన’ చిత్రంతో తెలుగు చిత్రసీమలో అరంగ్రేటం చేసి యువతరంలో మంచి ఫాలోయింగ్ను సంపాదించుకుంది మంగళూరు సోయగం కృతిశెట్టి. ఆరంభం అదిరిపోయినా..ఆ తర్వాత ఆశించిన విజయాలు దక్కించుకోలేక రేసులో వెనకబడిందీ భామ. ఇటీవల ఈ అమ్మడిపై వచ్చిన ఓ రూమర్ సోషల్మీడియాలో వైరల్గా మారింది. ఓ అగ్ర హీరో కుమారుడు కృతిశెట్టిని వేధిస్తున్నాడని, అతని ప్రవర్తన పట్ల ఆమెకు మనశ్శాంతి కరువైపోయిందని సోషల్మీడియాలో ప్రచారం జరిగింది.
తాజాగా ఈ వదంతులపై కృతిశెట్టి ట్విట్టర్ వేదికగా స్పందించింది. ఇవి పూర్తిగా నిరాధారమైన వార్తలని, కురచ మనస్తత్వం కలిగిన వ్యక్తులే ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తారని మండిపడింది. తొలుత ఈ వార్తలను సరదాగా తీసుకొని వదిలేద్దామనుకున్నానని, తన వ్యక్తిగత ఇమేజ్కు భంగం కలిగించేలా వైరల్ కావడం బాధించిందని కృతిశెట్టి పేర్కొంది. ప్రస్తుతం ఈ భామ తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తున్నది.