కరోనా మహమ్మారి సెలబ్రిటీల ఎంజాయ్మెంట్కు అడ్డుగా నిలిచింది. కరోనా లేకపోయింటే రెండు నెలలకొకసారి విహార యాత్రలకు వెళుతూ అక్కడ దిగిన ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రచ్చ చేసేవారు. కాని కరోనాతో వారి ఆనందానికి బ్రేకులు పడ్డాయి. అయితే కొందరు మాత్రం కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ విహరిస్తూనే ఉన్నారు. తాజాగా ఆదిపురుష్ బ్యూటీ కృతి సనన్ సింహాల ముందు స్టిల్ ఇచ్చి అందరి నోరెళ్లపెట్టేలా చేసింది.
1 నేనొక్కడినే సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన కృతి సనన్ బాలీవుడ్లో బరేలీకి బర్ఫీ, లుకా చుప్పి చిత్రాలతో మంచి విజయాలు సాధించి టాప్ హీరోయిన్ లిస్ట్లో చేరింది. ఇప్పుడు ఆదిపురుష్ చిత్రంలో ప్రభాస్ సరసన సీతగా నటించనుంది. అయితే కరోనా వలన షూటింగ్స్ స్తంభించడంతో కృతి జంగిల్ సఫారీలో షికారు చేస్తోంది. వైల్డ్ అనిమల్స్తో కలిసి డిజైనర్ వేర్స్లో స్పెషల్ ఫోటో షూట్ జరిపింది. ఈ ఫొటోలను కృతి తన సోషల్ మీడియాలో షేర్ చేయగా, తెగ వైరల్ అవుతున్నాయి.