Kriti Sanon | బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కాజోల్ దేవగన్, కృతిసనన్ (Kriti Sanon) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం దో పత్తి (Do Patti). ఈ సినిమాకు శశాంక చతుర్వేది దర్శకత్వం దర్శకత్వం వహిస్తుండగా.. నేరుగా నెట్ఫ్లిక్స్ వేదికగా ప్రీమియర్ కానుంది. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇదిలావుంటే తాజాగా ఈ చిత్రం నుంచి మేకర్స్ టీజర్ విడుదల చేశారు.
ఈ టీజర్ గమనిస్తే.. కృతిసనన్ సైకోగా కనిపిస్తుండగా.. ఆమెను పట్టుకునే పోలీస్ పాత్రలో కాజోల్ నటిస్తుంది. ఇక మిస్టరీ థ్రిల్లర్గా వస్తున్న ఈ చిత్రం త్వరలోనే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.
రోహిత్ శెట్టి డైరెక్షన్లో వచ్చిన దిల్వాలే తర్వాత కృతిసనన్, కాజోల్ కాంబోలో వస్తున్న రెండో సినిమా ఇది. 2024లో నెట్ ఫ్లిక్స్లో సందడి కానుండగా.. తేదీపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. కృతిసనన్, కనికా ధిల్లాన్ హోం బ్యానర్లు బ్లూ బటర్ఫ్లై ఫిల్మ్స్, కథా పిక్చర్స్ నుంచి వస్తున్న తొలి సినిమా కావడం విశేషం.