Actress Krithi Shetty | తొలి సినిమా ‘ఉప్పెన’తో తిరుగులేని క్రేజ్ తెచ్చుకుంది కృతి శెట్టి. ఈ సినిమా సక్సెస్లో సగం క్రెడిట్ ఈమెకు దక్కుతుంది. బేబమ్మగా ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది. ఆ తర్వాత ‘శ్యామ్ సింగరాయ్’, ‘బంగార్రాజు’ ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్లతో టాలీవుడ్ లక్కి చార్మ్ అయిపోయింది. ఇక ఇంకేముంది అవకాశాలు బేబమ్మ వైపు పరుగులు తీశాయి. కృతి కూడా ఒక్క సారిగా అరడజను సినిమాలకు సైన్ చేసింది. అయితే అక్కడే ఆమెకు బెడిసి కొట్టింది. పేరున్న హీరోలు, మంచి బ్యానర్లలో అవకాశాలు రావడంతో ఆమె పాత్రకు స్కోప్ ఎంతుందా? అనేది పట్టించుకోకుండా సినిమాలు చేసింది. కట్ చేస్తే బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లు మూటగట్టుకుంది. ప్రస్తుతం కృతి నటించిన ‘కస్టడీ’ మంచి టాక్తో దూసుకుపోతుంది.
ఇక ఇదిలా ఉంటే తాజాగా కృతి శెట్టి కస్టడీ సినిమా ప్రమోషన్లలో తన పర్సనల్ విషయాలను కూడా అభిమానులతో పంచుకుంది. ఇన్నేళ్ల తన సినీ ప్రయాణంలో మనసుకు నచ్చని పనులను చేయకపోవడమే బెటర్ అని తెలుసుకున్నానని చెప్పింది. ఈ క్రమంలోనే ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలో కొన్ని రొమాంటిక్ సీన్స్లో మనస్పూర్తిగా నటించలేకపోయాయని తెలిపింది. ఇక ఐటెం సాంగ్స్లో నటించడం గురించి ఓ ప్రశ్న ఎదురవగా.. అవి మాత్రం అస్సలు చేయనని చెప్పింది.
ప్రస్తుతానికైతే ఐటెం సాంగ్స్లో నటించాలనుకోవడం లేదని, తనకు అలాంటి పాటలపై అవగాహన లేదని తెలిపింది. అంతేకాకుండా వాటి గురించి ఎప్పుడు ఆలోచించలేదని, మనసుకు నచ్చనప్పుడు అలాంటివి చేయకుండా ఉండటమే బెటర్ అని ఈ అమ్మడు చెప్పుకొచ్చింది. ఇక నాగచైతన్యతో కలిసి నటించిన కస్టడీ మూవీ రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది. కానీ కలెక్షన్లు మాత్రం ఓ మాదిరిగానే వస్తున్నాయి. ద్విభాషా సినిమాగా రూపొందిన ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించాడు.