Krithi Shetty | ‘ఉప్పెన’ చిత్రంతో తెలుగులో అరంగేట్రం చేసింది కన్నడ సొగసరి కృతిశెట్టి. తొలి చిత్రంతోనే యువతరంలో మంచి ఫాలోయింగ్ను సంపాదించుకుంది. అయితే ఆ తర్వాత ఆశించిన విజయాలను దక్కించుకోలేదు. ప్రస్తుతం శర్వానంద్ సరసన ఓ చిత్రంలో నటిస్తున్నది. ఈ మధ్యకాలంలో తమిళ ఇండస్ట్రీపై ఎక్కువ దృష్టి పెట్టిన ఈ భామ అక్కడ జయం రవి సరసన ‘జీనీ’ అనే భారీ చిత్రంలో నటిస్తున్నది. దాదాపు వందకోట్ల బడ్జెట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విశేషమేమిటంటే..పద్దెనిమిది భాషల్లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.
తన కెరీర్లో తొలి పాన్ ఇండియా చిత్రమిదని, ఒడిదుడుకులతో సాగుతున్న సినీ ప్రయాణాన్ని మలుపుతిప్పుతుందని కృతిశెట్టి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నది. ‘కెరీర్లోనే భారీ బడ్జెట్ చిత్రమిది. సినిమా కాన్సెస్ట్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. నా క్యారెక్టర్లో భిన్న పార్శాలుంటాయి’ అని కృతిశెట్టి ఆనందం వ్యక్తం చేసింది. ఈ సినిమాలో ఈ భామతో పాటు కల్యాణి ప్రియదర్శన్, వామిక కబీ కథానాయికలుగా నటిస్తున్నారు.