కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) ఇటీవలే ఈటీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఫ్యామిలీ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ఈ స్టార్ హీరో త్వరలోనే మరో కొత్త సినిమా మొదలుపెట్టనున్నాడు. స్టార్ డైరెక్టర్ బాలా (Bala)తో సినిమా చేయబోతున్నాడు సూర్య. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో నందా, శివపుత్రుడు బ్లాక్ బాస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఈ చిత్రాన్ని సూర్య నిర్మించనుండటం విశేషం.
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కీ అప్డేట్ ఒకటి చెన్నై సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. ఉప్పెన, శ్యామ్ సింగ రాయ్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కృతిశెట్టి (Krithi Shetty) ఈ చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్ చేస్తోంది. దీనిపై అఫీషియల్ అప్ డేట్ రావాల్సి ఉంది. కృతిశెట్టి యాక్టింగ్కు ఇంప్రెస్ అయిన బాలా ఆమెను హీరోయిన్గా ఫైనల్ చేశాడట. ఈ భామ ఇప్పటికే పలు తెలుగు సినిమాల్లో హీరోయిన్గా నటిస్తోంది.
తమిళంలో సూర్య చేయబోతున్న తాజా ప్రాజెక్టు సక్సెస్ అయితే కృతిశెట్టి కోలీవుడ్లో లీడింగ్ హీరోయిన్ల జాబితాలో చేరిపోవడం ఖాయమంటున్నారు సినీ జనాలు. ఈ ఏడాది బంగార్రాజు సినిమాతో తెలుగు ఆడియెన్స్ ను పలుకరించింది కృతిశెట్టి. ప్రస్తుతం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, మాచెర్ల నియోజకవర్గం, ది వారియర్ చిత్రాల్లో నటిస్తోంది.