Krithi Shetty | ఉప్పెన సినిమాతో సిల్వర్ స్క్రీన్పై మాయ చేసింది ముంబై బ్యూటీ కృతిశెట్టి (Krithi Shetty). ఈ చిత్రంలో బేబమ్మ పాత్రలో క్యూట్ క్యూట్గా మెరిసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. సినిమా సినిమాకు పర్ఫార్మెన్స్ డోస్ పెంచుకుంటూ.. అదే రేంజ్లో ఫాలోవర్లను కూడా సంపాదించుకుంది. సోషల్ మీడియాలో ఈ భామ తక్కువ టైంలోనే అరుదైన మైల్స్టోన్ చేరుకుంది. కృతిశెట్టి ఇన్స్టాగ్రామ్ (Instagram)ఫాలోవర్ల సంఖ్య 6 మిలియన్లకు చేరుకుంది.
తనపై అమితమైన చూపిస్తూ.. తన ప్రయాణానికి మద్దతు అందిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు తెలియజేసింది కృతిశెట్టి. 2021లో ఉప్పెన సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన కృతిశెట్టి.. కేవలం రెండేళ్ల టైంలోనే 6 మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకుని టాక్ ఆఫ్ ది టౌన్గా నిలుస్తోంది. ఈ ఏడాది వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన కస్టడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది కృతిశెట్టి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.
కృతిశెట్టి ప్రస్తుతం తమిళంలో జయం రవితో కలిసి (Genie) సినిమాలో నటిస్తోంది. మలయాళంలో మరో సినిమా చేస్తోంది. ఈ రెండు సినిమాలతో ఓ వైపు మాలీవుడ్, మరోవైపు కోలీవుడ్లో కూడా పాగా వేసేందుకు రెడీ అయినట్టు చెప్పకనే చెబుతోంది.