హైదరాబాద్: ప్రముఖ నటుడు కృష్ణంరాజు కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైరదాబాద్లోని ఏఐజీ దవాఖానలో ఆదివారం తెల్లవారుజామున 3.25 గంటలకు తుదిశ్వాస విడిచారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన భౌతికకాయాన్ని దవాఖాన నుంచి జూబ్లీహిల్స్లోని నివాసానికి తరలించారు. అక్కడ కుటుంబ సభ్యులతోపాటు పలువురు కృష్ణంరాజు భౌతికకాయానికి నివాళులు అర్పించనున్నారు. రేపు మధ్యాహ్నం అభిమానుల కడసారి చూపుకోసం కోట్ల విజయ భాస్కర్రెడ్డి స్టేడియానికి తరలించనున్నారు. అటునుంచి మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో కృష్ణంరాజు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.