గమ్యం, వేదం, కృష్ణంవందే జగద్గురుమ్, కంచె వంటి గొప్ప సినిమాలను తెరకెక్కించి అభిరుచి గల దర్శకుడిగా కితాబులందుకున్నారు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి. సందేశాత్మక కథలకు వాణిజ్యఅంశాలను జోడించి జనరంజక చిత్రాలను అందించడం క్రిష్ ప్రత్యేకత. అయితే.. గత కొన్నేళ్లుగా క్రిష్ కెరీర్ సరైన ట్రాక్లో లేదు. ఎన్టీయార్ కథానాయకుడు, మహానాయకుడు, కొండపొలం, ఘాటీ చిత్రాల ఫలితాలు ఆయన కెరీర్పై తీవ్రమైన ప్రభావాన్నే చూపాయి. అందుకే.. గత వైభవాన్ని దక్కించుకునేందుకు ఈ సారి పకడ్బందీ వ్యూహంతో ముందుకెళ్తున్నారట క్రిష్.
ఈ సారి కాస్టింగ్పై కాకుండా కథపైనే ఎక్కువ శ్రద్ధపెట్టి, ఓ విభిన్నమైన కాన్సెప్ట్ని ప్రేక్షకులకు అందించే ప్రయత్నాల్లో ఆయన బిజీగా ఉన్నారట. అయిదుగురు అమ్మాయిల నేపథ్యంతో కూడిన ఓ కథను ఆయన ప్రస్తుతం తెరకెక్కిస్తున్నట్టు తెలిసింది. ఈ అయిదు ప్రధాన భూమికలకు అయిదుగురు యంగ్ హీరోయిన్లను ఎంపిక చేసినట్టు వినికిడి. ఇప్పటికే ఎలాంటి హడావిడి లేకుండా చిత్రీకరణ కూడా మొదలైంది. క్రిష్ గత చిత్రాల మాదిరిగానే ఆలోచింపజేసే కథ, కథనాలతో ఈ సినిమా ఉంటుందట. ఫస్ట్ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాజీవ్రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.