మనోజ్చంద్ర, మోనికా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’. స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ప్రవీణ పరుచూరి తెరకెక్కించారు. ఇందులో ఆమె ఓ కీలక పాత్రను కూడా పోషించారు. ఈ నెల 18న ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రవీణ పరుచూరి మాట్లాడుతూ ‘నాకు డైరెక్షన్ చేయాలని ఎప్పటి నుంచో కోరిక ఉంది.
యూఎస్లో ఫిల్మ్మేకింగ్కు సంబంధించిన కోర్స్ కూడా చేశా. ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ చిత్రంలో సూపర్నేచురల్ ఎలిమెంట్ ఉంటుంది. గ్రామదేవతల నేపథ్యంలో నడిచే ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. ఈ సినిమాలో ఓ జాతర సీన్ ‘పుష్ప-2’లోని సన్నివేశం తరహాలో పవర్ఫుల్గా ఉంటుంది’ అని అన్నారు. ఇటీవల ప్రెస్మీట్లో ఒకరు.. ఈ సినిమా ట్రైలర్ పెద్ద వంశీ సినిమాల తరహాలో ఉందని చెప్పారని, దానిని పెద్ద కాంప్లిమెంట్గా భావిస్తున్నానని, యాక్షన్, మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో సినిమాలు చేయాలనుకుంటున్నానని ప్రవీణ పరుచూరి చెప్పారు.