వైష్ణవ్తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘రంగ రంగ వైభవంగా’. గిరీశాయ (తమిళ ‘అర్జున్రెడ్డి’ ఫేమ్) దర్శకత్వం వహిస్తున్నారు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. కేతికా శర్మ కథానాయిక. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. జూలై 1న విడుదల చేయబోతున్నారు.
తాజాగా ఈ సినిమాలోని ‘కొత్తగా లేదేంటి’ అనే యుగళగీతాన్ని విడుదల చేశారు. శ్రీమణి సాహిత్యాన్నందించిన ఈ గీతాన్ని ఆర్మాన్ మాలిక్, హరిప్రియ ఆలపించారు. ప్రేమికుల మనసులోని భావాలకు అద్దం పడుతూ చక్కటి సాహిత్యంతో సాగిందీ గీతం. విజువల్గా కూడా ఈ పాట మంచి అనుభూతిని కలిగిస్తుందని, వినూత్న ప్రేమకథగా ఈ సినిమా మెప్పిస్తుందని దర్శకుడు తెలిపారు.