ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాష్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘కొత్త మలుపు’. భైరవి ఆర్థ్యా కథానాయిక. శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకుడు. తాటి బాలకృష్ణ నిర్మాత. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.
గ్రామీణ వాతావరణంలో సాగే ఈ రొమాంటిక్ ప్రేమకథలో సస్పెన్స్తోపాటు వినోదం కూడా ఉంటుందని, ఆకాష్, భైరవి బావామరదళ్లుగా నటించారని, త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తామని దర్శకుడు తెలిపారు. రఘుబాబు, పృథ్వీ, ప్రభావతి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: యశ్వంత్, నిర్మాణం: తథాస్తు క్రియేషన్స్.