మలయాళంలో విజయవంతమైన ‘నాయాట్టు’ చిత్రం తెలుగులో ‘కోట బొమ్మాళి పీఎస్’ పేరుతో రీమేక్ అవుతున్నది. శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. తేజ మార్ని దర్శకుడు. జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు, విద్య కొప్పినీడి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని శ్రీకాకుళం జానపదం గీతాన్ని ఈ నెల 11న విడుదల చేయబోతున్నారు.
‘పోలీస్ నేపథ్య కథాంశమిది. కుట్రలు, కుతంత్రాలను ఛేదించుకొని విజేతగా నిలిచిన ఆఫీసర్ జీవిత ప్రయాణం ఉత్కంఠను పంచుతుంది. శ్రీకాంత్ పాత్ర కొత్త పంథాలో ఉంటుంది’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: జగదీష్ చీకాటి, సంగీతం: రంజిన్ రాజ్, మిధున్ ముకుందన్, దర్శకుడు: తేజ మార్ని.