మెగా కాంపౌండ్ నుండి వచ్చిన యువ హీరో వైష్ణవ్ తేజ్.. ఉప్పెన సినిమాతో ప్రేక్షకులని ఎంతగా అలరించారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో కొండ పొలం అనే సినిమా చేశారు. సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి నిర్మించారు. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయిక. అటవీ నేపథ్యంలో సాగే ఈ అడ్వెంచర్ చిత్రాన్ని.. సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల ఆధారంగా రూపొందించారు.
కొండ పొలం అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేయగా, సెన్సార్ యూనిట్ ఈ చిత్రానికి క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చింది. ఫ్యామిలీ అంతా ఈ క్లీన్ ఎంటర్టైనర్ ని చూడొచ్చని అర్ధం అయ్యింది. మరి ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందివ్వగా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మాణం వహించారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని మేకర్స్ జస్ట్ సింగిల్ షెడ్యూల్ లో కంప్లీట్ చేసేసారు.
ఇటీవల చిత్ర ట్రైలర్ విడుదల కాగా, ఇందులో క్రిష్ మార్క్ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది కానీ కథానుసారం యాక్షన్ మోతాదు కూడా బాగానే కనిపిస్తుంది. గొర్రెల కాపరుల కుటుంబానికి చెందిన కటారు రవీంద్ర యాదవ్గా వైష్ణవ్ కనిపించనుండగా, కొండపొలం వెళ్లిన తర్వాత అడవుల్లో క్రూర మృగాలతో పాటు ప్రమాదకరమైన మానవ మృగాల నుంచి హీరో తన గొర్రెలను, కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు అనేది సినిమాలో ఆసక్తికరంగా చూపించనున్నారు.