కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్కు బైక్ రైడింగ్ హాబీ. బైక్స్పై ఆయన తరుచూ పర్యటనలు చేస్తుంటారు. ప్రస్తుతం బైక్ మీద ప్రపంచయాత్రకు సిద్ధమవుతున్నారు అజిత్. ఇప్పటికే దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు నేపాల్, భూటాన్ వంటి దేశాలను చుట్టివచ్చారు. నవంబర్లో ఈ యాత్రను తిరిగి ప్రారంభించబోతున్నారు.
ఈ విషయాన్ని అజిత్ టీమ్ మెంబర్ సురేష్ చంద్ర సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం అజిత్ తన 62వ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్నది. దర్శకుడు మగిజ్ తిరుమేని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి ‘వడా మయార్చి’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమాను అక్టోబర్ చివరికల్లా పూర్తి చేయనున్నారు.