Nayanthara | నయనతార పేరు కొద్దిరోజులుగా తరచూ వార్తల్లో వినిపిస్తూనే ఉంది. ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీలో చిక్కుకుంటూనే ఉంది. కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్తో ప్రేమాయణం నుంచి మొదలుపెడితే పెండ్లి, సరోగసీ ద్వారా కవల పిల్లలకు జన్మనివ్వడం వరకు అన్నీ ఏదో వివాదాన్ని సృష్టిస్తూనే వచ్చాయి. ఒకవైపు వరుస సినిమాలు, మరోవైపు ఎప్పుడూ ఏదో ఓ వివాదంలో చిక్కుకుంటూ ఉండటంతో కొద్దిరోజులుగా మెంటల్ టెన్షన్స్ పడుతున్న నయన్ కొద్దిరోజులు సినిమాలకు బ్రేక్ ఇచ్చి ప్రశాంతంగా లైఫ్ ఎంజాయ్ చేయాలని అనుకుంటుంది. ఇలా వరుస వివాదాలను చుట్టుముడుతున్న నయనతార గురించి ఆమె అత్త, విఘ్నేశ్ శివన్ తల్లి మీనా కుమారి షాకింగ్ విషయాలు చెప్పింది.
తన కోడలు నయనతార మనస్సు చాలా గొప్పదని మీనాకుమారి పొగడ్తలతో ముంచెత్తింది. తన కొడుకు సక్సెస్ఫుల్ డైరెక్టర్ అని.. కోడలు స్టార్ హీరోయిన్ అని.. వాళ్లిద్దరూ ఎంతో కష్టపడి పనిచేస్తారని చెప్పుకొచ్చింది. తన కొడుకు, కోడలు ఇద్దరూ కష్టపడి పనిచేయడమే కాదు.. కష్టపడి పనిచేసేవాళ్లను కూడా అంతే గౌరవిస్తారని పేర్కొంది. తన కొడుకు ఇంట్లో ఎనిమిది మంది పనివాళ్లు ఉంటారని చెప్పింది. అయితే వారిలో ఒకరికి నాలుగు లక్షల వరకు అప్పు ఉందని తన కోడలు నయన్కి తెలిసిందట. వెంటనే ఆ పని మనిషికి రూ.4లక్షలు డబ్బు ఇచ్చి బాకీలు కట్టేయమని చెప్పిందట. ఈ విషయాన్ని విఘ్నేశ్ శివన్ తల్లి మీడియా ముందు బయటపెట్టింది. ఇంట్లో పనిచేసేవాళ్లకు అంతపెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చి సాయం చేసేందుకు ఎంతో దయా హృదయం ఉండాలని మెచ్చుకుంది.
Nayanthara | లైఫ్ సంతృప్తికరంగా ఉంది.. లేడీ సూపర్ స్టార్కు భర్త స్పెషల్ విషెస్..!”