Mani Ratnam tests Covid Positive | లేజెండరీ దర్శకుడు మణిరత్నం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈయన సినిమాలకు హాలీవుడ్ సినీప్రముఖులలో కూడా ఫ్యాన్స్ ఉన్నారంటే మణిరత్నం స్థాయి ఏంటో అర్ధమవుతుంది. ప్రేక్షకుడి పల్స్ తెలిసిన దర్శకుడీయన. ఈయన ప్రేమ కథలకు వీరాభిమానులున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మణిరత్నంకు కరోనా లక్షణాలు ఉండటంతో చెన్నైలోని అపోలో హాస్పిటల్లో చేరాడు. ఈయనకు పరీక్షలు నిర్వహించగా ఫలితాల్లో నెగెటివ్గా తేలింది. దాంతో కుటుంబ సభ్యులు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
ప్రస్తుతం మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియిన్ సెల్వన్’ విడుదలకు సిద్ధంగా ఉంది. చియాన్ విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష, బాబీ సింహా వంటి స్టార్లు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం రెండు పార్టులుగా తెరకెక్కుతోంది. ఈ చిత్ర మొదటి భాగం సెప్టెంబర్ 30న విడుదల కానుంది. ఇలాంటి సమయంలో మణిరత్నంకు కూడా కరోనా లక్షణాలతో హాస్పిటల్ చేరడం అభిమానులకు ఆందోళనకు గురిచేసింది. అయితే రిపోర్ట్స్లో నెగెటివ్ రావడంతో ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకున్నారు.