karthik Subbaraj Clarifies On Jigarthanda-2 | ‘పిజ్జా’, ‘జిగర్తాండ’, ‘పెట’, ‘మహాన్’ వంటి చిత్రాలతో తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్. డెబ్యూ సినిమాతోనే తమిళ పరిశ్రమను ఒక్క సారిగా తనవైపు చూసేలా చేసుకున్నాడు. ఇక ఈయన సినిమాల్లో జిగార్తండ చాలా మంది ఫేవరెట్. సిద్ధార్థ్ హీరోగా నటించిన ఈ సినిమాలో బాబి సింహా ముఖ్య పాత్రలో నటించాడు. 2014లో విడుదలైన ఈ చిత్రం తమిళంలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. కమర్షియల్గా ఈ చిత్రం భారీ విజయం సాధించక పోయినా విమర్శకుల నుండి గొప్ప ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రాన్ని తెలుగులో వరుణ్తేజ్ ‘గద్దలకొండ గణేష్’ టైటిల్తో రీమేక్ చేశాడు. ఇక సోమవారంతో ఈ చిత్రం 8 ఏళ్ళను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో కార్తిక్ సుబ్బరాజు ఓ స్పెషల్ వీడియోను విడుదల చేశాడు.
ఈ వీడియోలో ‘జిగర్తాండ’ మేకింగ్ను చూపించారు. అంతేకాకుండా వీడియో చివర్లో ‘జిగర్తాండ-2’ తెరకెక్కనున్నట్లు కార్తిక్ హింట్ ఇచ్చాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులను జరుపుతున్నట్లు వీడియోలో వెల్లడించాడు. కాగా జిగర్తాండ చిత్రం రెండు నేషనల్ అవార్డులను కూడా గెలుచుకుంది. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా బాబి సింహా, బెస్ట్ ఎడిటర్గా వివేక్ హర్షన్ అవార్డులను గెలుచుకున్నాడు. ఈ చిత్రాన్ని హిందీలో ‘బచ్చన్ పాండే’ పేరుతో అక్షయ్కుమార్ రీమేక్ చేశాడు. బాబీ సింహా పాత్రలో అక్షయ్కుమార్ నటించగా, సిద్ధార్థ్ పాత్రలో కృతి సనన్ నటించింది. ఈ ఏడాది ప్రథమార్థంలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫేయిల్యూర్గా మిగిలింది.
And….. pic.twitter.com/pKL2Qi4oks
— karthik subbaraj (@karthiksubbaraj) August 1, 2022