Actor Dhanush | కలియుగ దైవం తిరుమల శ్రీవారిని ప్రముఖ కోలీవుడ్ నటుడు ధనుష్ (Dhanush) దర్శించుకున్నారు. ఈరోజు వీఐపీ నైవేద్య విరామ సమయంలో ధనుష్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ ఆలయ అధికారులు ధనుష్కు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఇక ధనుష్ నటించిన తాజా చిత్రం కెప్టెన్ మిల్లర్. ఈ సినిమా సంక్రాంతి కానుకగా తమిళంలో విడుదలై మంచి విజయం అందుకుంది. ఇక తెలుగులో రిపబ్లిక్ డే కానుకగా ఈ సినిమా విడుదల కాగా ఇక్కడ కూడా పాజిటివ్ టాక్తో మంచి వసూళ్లు రాబడుతుంది.