యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం ‘మీటర్’. రమేష్ కాదూరి దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై చిరంజీవి (చెర్రి), హేమలత పెద్దమల్లు నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 7న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. నిర్మాతలు మాట్లాడుతూ ‘కిరణ్ అబ్బవరంతో నిర్మిస్తున్న పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది. ఈ చిత్రంలో ఆయన పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తాడు. ఆయన లుక్ కొత్తగా వుంటుంది. కిరణ్ కెరీర్లో అత్యధిక బడ్జెట్తో నిర్మించిన చిత్రమిది’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, లైన్ ప్రొడ్యూసర్: అలేఖ్య పెద్దమల్లు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బాబా సాయి. సమర్పణ: నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి.