కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై రూపొందుతున్న తాజా చిత్రం సోమవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ సమర్పణలో చిరంజీవి(చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మిస్తున్నారు. రమేష్ కాదూరి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. హీరోపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు కొరటాల శివ క్లాప్నిచ్చారు. కె.ఎస్ రవీంద్ర(బాబీ) కెమెరా స్విఛాన్ చేయగా గోపీచంద్ మలినేని గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్, చిరంజీవి దర్శకుడికి స్క్రిప్ట్ను అందజేశారు. చిత్రబృందం మాట్లాడుతూ ‘పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది. బాబీ, గోపీచంద్ మలినేని వద్ద దర్శకత్వశాఖలో పనిచేసిన రమేష్ కాదూరి సరికొత్త పాయింట్తో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అగ్రనిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, ‘మత్తు వదలరా’చిత్రంతో పెద్ద విజయాన్ని అందుకున్న క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త కలయికలో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రూపొందిస్తున్నాం’ అని తెలిపింది. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: వెంకట్ సీ దిలీప్, సంభాషణలు: రమేష్ కాదూరి, సూర్య, లైన్ ప్రొడ్యూసర్:అలేఖ్య పెదమల్లు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బాబా సాయికుమార్, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: రమేష్ కాదూరి.