ఈ కాలం నాటి అందాల భామలు పోటీ పడి గ్లామర్ షో చేస్తున్నారు. వీరి అందాల ఆరబోతతో సోషల్ మీడియా షేక్ అవుతుంది. ముఖ్యంగా బాలీవుడ్ భామలు పోటీ పడుతూ గ్లామర్ షో చేస్తుండడంతో యూత్కి కంటిపై కునుకు లేకుండా పోతుంది. భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్కి పరిచయమైన కియారా ఆ తర్వాత రామ్ చరణ్తో వినయ విధేయ రామ చిత్రంలో నటించింది.
ఇప్పుడు రామ్ చరణ్ సరసన మరోసారి జతకట్టేందుకు సిద్ధమైంది ఈ ముద్దుగుమ్మ. శంకర్ తెరకెక్కించనున్న చిత్రంలో కథానాయికగా ఎంపికైన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం షేర్షా చిత్ర ప్రమోషన్లో బిజీగా ఉంది. సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చింది. బ్లాక్ డ్రెస్లో తన క్లీవేజ్ చూపిస్తూ ప్రేక్షకులకు ట్రీట్ ఇచ్చింది ఈ సుందరి. ప్రస్తుతం కియారా పిక్స్ నెట్టింట వైరల్గా మారాయి.
సిద్ధార్థ్ మల్హోత్రా అనే నటుడితో కియారా అద్వానీ కొంత కాలంగా లవ్ ఎఫైర్ నడిపిస్తుందని, వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతూ డేటింగ్ చేస్తున్నారని తెగ వార్తలు వచ్చాయి. ఈ ఇద్దరూ కలిసి పలు పార్టీల్లో చెట్టాపట్టాలేసుకు తిరగటం, హలీడే వేకషన్కు మాల్దివులకు వెళ్లడం, బర్త్ డే వేడుకల్లో ఎంజాయ్ చేయడం చూసి వీళ్ళ మధ్య ప్రేమ బాగా ముదిరిందని అంతా ఫిక్సయ్యారు. ఈ పరిస్థితుల నడుమనే ఈ ఇద్దరూ కలిసి రీసెంట్గా ‘షేర్షా’ మూవీ కంప్లీట్ చేశారు. ఆగస్టు 12వ తేదీన ఈ మూవీ రిలీజ్కి రెడీ అయింది. అయితే కియారా మాత్రం తామిద్దరిం ఫ్రెండ్స్ అని చెబుతుంది.