Tere Ishk Mein Movie | దక్షిణాదితో పాటు ఉత్తరాదిన కూడా ధనుష్కు మంచి పాపులారిటీ ఉంది. పదేళ్ల కిందటే ‘రాంఝనా’ అనే సినిమాతో బాలీవుడ్లో అరివీర భయంకర హిట్టు కొట్టాడు. ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో సంచలన రికార్డులు నెలకొల్పింది. మళ్లీ ఎనిమిదేళ్లకు అదే దర్శకుడితో ‘అత్రంగి రే’ సినిమా చేశాడు. నేరుగా ఓటీటీలో రిలీజైన ఈ సినిమాకు ఊహించని రేంజ్లో రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ముచ్చటగా మూడో సారి ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వంలో ‘తేరే ఇష్క్ మేయిన్’ అనే రోమ్ కామ్ సినిమా చేస్తున్నాడు. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ ఇదే ఏడాది చివర్లో మొదలు కానుంది.
ఏయిర్ ఫోర్స్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దర్శకుడు ఆనంద్ లవ్ టచప్ ఇచ్చినట్లు టాక్. గతంలో వీళ్ల కాంబినేషన్లో తెరకెక్కిన రెండు సినిమాలు బ్యూటిఫుల్ లవ్స్టోరీలుగా నిలిచాయి. ఇక ఇప్పుడు తేరే ఇష్క్ మేయిన్ సినిమాలో కూడా అలాంటి బ్యూటిఫుల్ ప్రేమకథ ఉండనుందట. కాగా ఇందులో ధనుష్కు జోడీగా కియారా అద్వానిని ఎంపిక చేసే పనిలో ఉన్నారట. ఇటీవలే కియారాకు కథ చెప్పగా.. ఆమె వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. రేపో మాపో ఈ న్యూస్ అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇచ్చేస్తారని చెన్నై టాక్.
ఇక ప్రస్తుతం ధనుష్ యమ బిజీగా ఉన్నాడు. దాదాపు అరడజనుకు పైగా సినిమాలను లైన్లో పెట్టుకున్నాడు. ప్రస్తుతం అరుణ్ మాతేశ్వరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కేప్టెన్ మిల్లర్ సినిమాతో బిజీగా గడుపుతున్నాడు. సందీప్ కిషన్ కీలకపాత్ర పోషిస్తున్న ఈ సినిమా పీరియాడిక్ గ్యాంగ్ స్టార్ నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఇది పూర్తి కాగానే ధనుష్ తన ప్రతిష్టాత్మక 50వ సినిమాను ప్రారంభించనున్నాడు. ఈ సినిమాకు దర్శఖుడు కూడా ధనుష్ కావడం విశేషం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపకుంటున్న ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది.